ఏప్రిల్ 9 న  బిచ్కుందలో జాబ్ మేళా

ఏప్రిల్ 9 న  బిచ్కుందలో జాబ్ మేళా

పిట్లం, వెలుగు: ఐక్యూ ఏసీ, టాస్క్​ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం జాబ్​మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్​కె.అశోక్​తెలిపారు. విజయ బయో ఫెర్టిలైజర్స్​కంపెనీలో సేల్స్​ఎగ్జిక్యూటివ్, గ్రూప్​లీడర్, టీమ్ మేనేజర్​పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగనున్నట్లు చెప్పారు.

ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులన్నారు. వీటితోపాటు ముత్తూట్​ఫైనాన్స్​లో ఇంటర్న్​షిప్​కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, డిగ్రీ పాసైనవారు ఇందుకు అర్హులని తెలిపారు. సెలెక్ట్​అయినవారిని ఆరు నెలల అనంతరం జూనియర్​ ఎగ్జిక్యూటివ్​స్థాయికి ప్రమోట్​చేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.