
- అగ్రికల్చర్ యూనివర్సిటీ టాపర్గా తేజశ్విని
బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల మండలం జోగాపూర్కు చెందిన యువతి చదువులో సత్తా చాటి రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. గ్రామంలోని నికాడి శ్యామల–మధునయ్య దంపతుల కూతురు తేజశ్విని జగిత్యాల జిల్లా పొలాసలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ విద్య అభ్యసించింది. ఉత్తమ ప్రతిభకనబర్చి యూనివర్సిటీ స్థాయిలో అన్ని సబ్జెక్టుల్లో, ఓవరాల్ గ్రేడ్ పాయింట్లలో మెరిట్సాధించి గోల్డ్మెడల్ సాధించింది.
ఎంఎస్సీ అగ్రికల్చర్ మేజర్ ఫీల్డ్ జనటిక్స్, ప్లాంట్బ్రీడింగ్లో మెరిట్ సాధించి మరో గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఆదివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ జయశంకర్ యూనిర్సిటీలో గవర్నర్ విష్ణుదేవ్శర్మ, ఇండియన్ కౌన్సిల్ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్డాక్టర్ మంగిలాల్ జత్, వర్సిటీ రిజిస్టార్ విద్యాసాగర్, వీసీ అల్దాస్ జానయ్య ఆమెను సన్మానించి బంగారు పతకాలు అందజేశారు.