జోగాపూర్ విద్యార్థినికి రెండు గోల్డ్ మెడల్స్

జోగాపూర్ విద్యార్థినికి రెండు గోల్డ్ మెడల్స్
  • అగ్రికల్చర్​ యూనివర్సిటీ టాపర్​గా తేజశ్విని

బెల్లంపల్లి రూరల్, వెలుగు: నెన్నెల మండలం జోగాపూర్​కు చెందిన యువతి చదువులో సత్తా చాటి రెండు గోల్డ్​ మెడల్స్​ సాధించింది. గ్రామంలోని నికాడి శ్యామల–మధునయ్య దంపతుల కూతురు తేజశ్విని జగిత్యాల జిల్లా పొలాసలో ప్రొఫెసర్​ జయశంకర్ ​అగ్రికల్చర్​ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్​ విద్య అభ్యసించింది. ఉత్తమ ప్రతిభకనబర్చి యూనివర్సిటీ స్థాయిలో అన్ని సబ్జెక్టుల్లో, ఓవరాల్ ​గ్రేడ్​ పాయింట్లలో మెరిట్​సాధించి గోల్డ్​మెడల్​ సాధించింది. 

ఎంఎస్సీ అగ్రికల్చర్​ మేజర్​ ఫీల్డ్​ జనటిక్స్, ప్లాంట్​బ్రీడింగ్​లో మెరిట్ సాధించి మరో గోల్డ్​ మెడల్​ దక్కించుకుంది. ఆదివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ జయశంకర్​ యూనిర్సిటీలో గవర్నర్​ విష్ణుదేవ్​శర్మ, ఇండియన్​ కౌన్సిల్​ఆఫ్​ అగ్రికల్చర్​ రీసెర్చ్​డాక్టర్​ మంగిలాల్ ​జత్, వర్సిటీ రిజిస్టార్​ విద్యాసాగర్, వీసీ అల్​దాస్​ జానయ్య ఆమెను సన్మానించి బంగారు పతకాలు అందజేశారు.