తల నరికాడు : జోగులాంబ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

తల నరికాడు : జోగులాంబ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

పట్ట పగలు అందరు చూస్తుండగానే నడి రోడ్డుపై వ్యక్తిని దారుణంగా చంపాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన మంగళవారం జోగులాంబ గద్వాలజిల్లా, ధరూర్ మండలంలో జరిగింది. ర్యాలంపాడు గ్రామానికి చెందిన తాయన్న తలారిగా విధులు నిర్వహిస్తుండేవాడు. తాయన్న మృతి చెందడంతో  ఆయన ఉద్యోగం అతని కుమారుడు రాజు నిర్వహిస్తున్నాడు. తాయన్న సోదరుడి కుమారుడు కూడా తలారి ఉద్యోగం మాకే ఇవ్వాలని చాలాసార్లు ఘర్షణకు దిగ్గినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. రాజుపై కక్ష పెంచుకున్న తాయన్న తమ్ముడు ఎలాగైన రాజును చంపాలనుకుని పక్కా ప్లాన్ వేశాడు. మంగళవారం ఉదయం ధరూర్ నుంచి ర్యాలంపాడుకు వెళ్లిన రాజు… అక్కడ అందరిని పలకరించి, తిరిగి ధరూర్ కు తన బైక్ పై వస్తుండగా… కాపు కాసుకొని హత్య చేశారు.

వేటకొడవళ్లతో… వెంకటన్న అనే వ్యక్తి తలపై వేటు వేయడంతో…. సంఘటన స్థలంలోనే మృతి చెందాడు రాజు. కొడవలితో బలంగా మెడను లాగడంతో తలకాయ మొత్తం ఊడి వచ్చింది. చంపిన వ్యక్తిని పట్టుకోవడానికి గ్రామస్తులు ప్రయత్నించగా కొడవలితో…. భయపెట్టి అక్కడ నుంచి పారిపోయాడని తెలిపారు గ్రామస్ధులు. పట్టపగలే హత్య జరుగడంతో…. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.  హత్య విషయం తెలుసుకున్న ధరూర్ ఎస్ఐ‌ ఎం.రాము సర్ తన సిబ్బందితో సంఘటన‌స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బంధోబస్తు చేశారు.గద్వాల సిఐ హనుమంతు, సంఘటన స్థలానికి చేరుకుని….హత్యకు  గల కారణాలు స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి ఆరతీసి దర్యాప్తు జరుపుతున్నారు.