
హైదరాబాద్ సిటీ, వెలుగు: పదవీ విరమణ రోజున చివరి నిమిషం వరకూ తన డ్యూటీని సిన్సియర్గా చేసిన వ్యక్తి గుడ్డొజి శ్రీనివాస్ అని, అతడిలాంటి ఉద్యోగిని తాను ఇంతవరకూ ఎక్కడా చూడలేదని ఎక్సైజ్అడిషనల్, జాయింట్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి అన్నారు. అబ్కారీ భవన్లోని టీజీబీసీఎల్ హెడ్డాఫీసులో పీఎఫ్ విధులు నిర్వహించే గుడ్డొజి శ్రీనివాస్ ఆదివారం పదవీ విరమణ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్ దంపతులను టీజీబీసీఎల్ జీఎంలతో పాటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాశీనాథ్, ఇతర లీడర్లు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. టీజీబీసీఎల్ జీఎంలు గుండమనేని శ్రీనివాస రావు, బి.ఆంశా, సీహెచ్ ప్రమోద్ కుమార్, ఉద్యోగుల సంఘం కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి జీ.టీ. జీవన్ పాల్గొన్నారు.