సెంచరీతో చెలరేగిన బట్లర్..హైదరాబాద్ టార్గెట్-221

సెంచరీతో చెలరేగిన బట్లర్..హైదరాబాద్ టార్గెట్-221

ఢిల్లీ: ఐపీఎల్ సీజన్-14లో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది. ప్రారంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ ఓపెనర్ బట్లర్(124) సెంచరీతో చెలరేగడంతో ఢిల్లీ గ్రౌండ్ లో పరుగుల వరద పారింది. అతడికి తోడు సంజు కూడా 48తో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్, విజయ్ శంకర్, సందీప్ శర్మకు తలో వికెట్ దక్కింది.