
నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులకు నెల రోజుల వ్యవధిలో గవర్నమెంట్ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్అలీ, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయా జర్నలిస్టు యూనియన్ల లీడర్లు సుధీర్ఘకాలం నలుగుతున్న ఈ సమస్య గురించి మాట్లాడడానికి వారిని హైదరాబాద్ వెళ్లి కలువగా వారు ఈ మేరకు హామీ ఇచ్చారు.