
- స్పాట్ కేంద్రాల్లో రెండోరోజు నిరసనలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కొత్త జూనియర్ లెక్చరర్లకు రెండో వార్షిక ఇంక్రిమెంట్ రిలీజ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వసుకుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, హనుమకొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి (కాచిగూడ క్యాంపు) తదితర ఇంటర్ మూల్యాంకన కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి లెక్చరర్లు నిరసన తెలిపారు.
అనంతరం క్యాంప్ ఆఫీసర్లకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... న్యాయబద్దంగా రావాల్సిన ఇంక్రిమెంట్ విషయమై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే భవిష్యత్లో న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.