సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు

సీఎస్​గా బాధ్యతలు  స్వీకరించిన రామకృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే.రామకృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు పదవీ విరమణ చేసిన శాంతి కుమారి నుంచి ఆయన  బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.  కొత్త సీఎస్​కు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు, సెక్రటేరియెట్​ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. 

బాధ్యతలు తీసుకున్న తరువాత రామకృష్ణారావు.. మొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రాల సీఎస్​లతో    "ప్రగతి" సమావేశంలో  ఆయన పాల్గొన్నారు.  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల పురోగతిపై  పీఎం సమీక్షించారు. సీఎస్​తో పాటు స్పెషల్​ సీఎస్​ జయేశ్ రంజన్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు.