- 23 నుంచి తెలంగాణలో యాత్ర
- ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నెల 23 నుంచి యాత్ర ప్రారంభించనున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఈ యాత్రను స్టార్ట్ చేసి, అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. “పాల్ రావాలి.. పాలన మారాలి” అన్న నినాదంతో ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. బుధవారం అమీర్పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. యాత్రలో సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఫోన్లో కోరగా.. అంగీకరించారన్నారు. కానీ, తెలంగాణ డీజీపీ స్పందించటం లేదన్నారు. ఈ నెల 9 నుంచి మొదట ఏపీలో ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు.