
కాగ జ్ నగర్, వెలుగు: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం చింతగూడలో ఆదివారం ఆసక్తికర ఘటనలు జరిగాయి. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కాగజ్ నగర్ డీఎస్పీ రామానుజం ఆధ్వర్యంలో గ్రామంలో తనిఖీలు చేసి 120 బైక్ లు, 8 ఆటోలు సీజ్ చేశారు. కాగా.. మద్యం పట్టుబడలేదు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా బెల్ట్ షాపులు బంద్ కు చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామ మహిళలు మూకుమ్మడిగా బెల్ట్ షాపుల్లోకి వెళ్లి లిక్కర్, గుడుంబా బాటిల్స్ బయటకు తెచ్చిపడేశారు.
వాటిని ఎక్సైజ్ అధికారులు తీసుకుని వెళ్లడం గమనార్హం. గ్రామంలోని బెల్ట్ షాప్ లతో ఆర్థికంగా నష్టపోతున్నామని, జీవితాలు నాశనమవుతున్నాయని చెప్పినా ఆఫీసర్ల పట్టించుకోవడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తనిఖీల్లో మద్యం పట్టుబడక పోగా, మహిళలు బయటకు తీయడం పై స్థానికంగా చర్చనీయాంశమైంది.