ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ‘కాకా ఫౌండేషన్’

ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ‘కాకా ఫౌండేషన్’

మంచిర్యాల: కరోనా క్రైసిస్ సమయంలో ఇబ్బందులు పడుతున్నవారందరికీ కాకా ఫౌండేషన్ ఆపన్నహస్తం అందిస్తోంది. తాజాగా కాకా ఫౌండేషన్ సౌజన్యంతో బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం క్యాథనపల్లిలో బీజేపీ శ్రేణులు ప్రైవేట్ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ ఏడేళ్ల పాలన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ‘సేవా హీ సంఘటన్’ పేరుతో బీజేపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.