
హసన్ పర్తి, వెలుగు: వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో మే లో నిర్వహించిన డిగ్రీ (బి.ఎ., బి.కాం, బి.ఎస్.సి) 2, 4 సెమిస్టర్ పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య పి. మల్లారెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో సెమిస్టర్ లో 28 శాతం, నాల్గో సెమిస్టర్ లో 36 శాతం ఉత్తీర్ణత అయినట్లు చెప్పారు.
మరిన్ని వివరాలు www.kakatiya.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు. పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమల దేవి, క్యాంపు ఆఫీసర్లు అసిం ఇక్బాల్, సమ్మయ్య, సహాయ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు ఉన్నారు.