వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అందజేశారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆరుగురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, ఆర్టీఏ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, మాజీ జడ్పీటీసీ మహిపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
