మాజీ రాజ్యసభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలు, నేతలు దూరమవడానికి కారణం సంతోష్ రావే అని అన్నారు. మొత్తం పార్టీలో నాయకులు, కార్యకర్తలకు రక్తకన్నీరు పెట్టించిన మొట్టమొదటి దుర్మార్గుడు సంతోష్ రావేనని కల్వకుంట్ల కవిత అరోపించారు.
బీఆర్ ఎస్ పార్టీకి , ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు ఉద్యమకారులు దూరం చేసిన మొదటి దయ్యం సంతోష్ రావు అని ఆరోపించారు. కవిత. గద్దర్ ను గేటుదగ్గర నిలబెట్టినా..ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమ నాయకులు బీఆర్ ఎస్ వీడటానికి కారణం సంతోష్ రావే అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో సంతోష్ రావు అంటకాగుతున్నారని అన్నారు కల్వకుంట్ల కవిత. ఫాంహౌజ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం తిన్నా. ఏం చేసినా.. సగం ఇండ్లి తిన్నాడా.. మొత్తం ఇండ్లి తిన్నాడా అన్న విషయాలతో సహా సమాచారం ఇచ్చేది సంతోష్ రావేనని కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు.
ఇక సంతోష్ రావుపై సిట్ విచారణ జరుపుతామంటోంది.. సిట్ పిలవడం బాగానే ఉందిగానీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది అనుమానంగా ఉందన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థంకావడం లేదన్నారు.చట్టం కరెక్టుగా పనిచేస్తే సంతోష్ రావుకు శిక్ష ఖామని అన్నారు కల్వకుంట్ల కవిత.
