
జహీరాబాద్, వెలుగు: నియోజకవర్గంలోని ఝరాసంగం, కోహీర్, నాల్కల్, జహీరాబాద్, మొగడంపల్లి మండలాలతో పాటు జహీరాబాద్ పట్టణానికి చెందిన 925 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు శనివారం ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే మాణిక్ రావు, సెట్విన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఉజ్వల్రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు.
ఆడపిల్లల వివాహాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో ఆర్థిక సాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ అబ్దుల్ ముబీన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, రాంలింగా రెడ్డి, కండెం, నర్సింహులు, నర్సింహారెడ్డి, మహ్మద్, మక్సూద్, యూత్ కాంగ్రెస్ జిల్లా, అసెంబ్లీ అధ్యక్షులు నరేశ్ గౌడ్, నాగిరెడ్డి పాల్గొన్నారు.