నాగర్ కర్నూల్లో గో, వృషభ రాజుల కల్యాణం

  నాగర్ కర్నూల్లో గో, వృషభ రాజుల కల్యాణం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో ఆదివారం మంత్రోచ్ఛరణల నడుమ గో, వృషభ రాజుల కల్యాణాన్ని నిర్వహించారు. అనంత శ్రీ గోశాల ట్రస్ట్  భవనంలో చైర్మన్  సౌజన్య, జగన్మోహన్ కులకర్ణి దంపతులు కల్యాణం జరిపించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ లోక కల్యాణార్థం లక్ష్మీ స్వరూపమైన గోమాతతో వృషభ రాజు కల్యాణం జరిపించినట్లు చెప్పారు. చిన్నప్పటి నుంచి గోవులను పూజిస్తున్నట్లు తెలిపారు. గతంలో గోవులకు శ్రీమంతం, నామకరణం లాంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.