- చీరల పంపిణీ చేసిన మంత్రి గంగుల
కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ పథకాల అమలులో ఆర్పీలు కీలకమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల ఆర్పీలు, వీవోలు 221 మందికి సొంత ఖర్చుతో చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయమని స్పష్టం చేశారు.
ఆర్పీలకు రూ. 2014కు ముందు రూ.200ఉన్న జీతాన్ని సీఎం కేసీఆర్రూ.4వేలకు పెంచారన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల్ని ఇస్తున్నామన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్కు మానేరు నది ఉన్నా ట్యాంకులతో నీళ్లు తెచ్చుకునేవాళ్లమని గుర్తు చేశారు. ప్రస్తుతం సిటీలో డెయిలీ వాటర్ సప్లై జరుగుతోందని, త్వరలో 24/7 తాగునీటిని సప్లై చేసేందుకు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
కల్యాణోత్సవాన్ని సక్సెస్ చేయాలి
బుధవారం టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర దేవాలయానికి భూమిపూజతోపాటు సాయంత్రం నిర్వహించనున్న శ్రీనివాసుని కల్యాణ వేడుకలను సిటీవాసులు సక్సెస్చేయాలని మంత్రి కోరారు. అంతకుముందు మానేర్ రివర్ ఫ్రంట్ పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, ఎంపీపీ టి.లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జడ్పీటీసీ కరుణ, కార్పొరేటర్లు వేణు, మాధవి, రమణారావు, ఐలేందర్ యాదవ్ పాల్గొన్నారు.