డ్యూటీ సక్కగ చేయలేదని.. మున్సిపల్ ​కమిషనర్​ సరెండర్

డ్యూటీ సక్కగ చేయలేదని.. మున్సిపల్ ​కమిషనర్​ సరెండర్

కామారెడ్డి, వెలుగు: ఎన్నికల ఏర్పాట్లు, డ్యూటీలో నిర్లక్ష్యం, తప్పుల తడకగా ఓటర్ల జాబితా వంటి కారణాల వల్ల కామారెడ్డి మున్సిపల్​ కమిషనర్ ప్రభాకర్​ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్​ సత్యనారాయణ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వార్డుల విభజన,  వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ,  సామాజిక వర్గాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాల విడుదల తదితర విధుల్లో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 10న విడుదల చేయాల్సిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా..12 న విడుదలైంది. జాబితాలో పేర్లు గల్లంతు కావటం, కులాలను కూడా మార్చేయడం వివాదస్పదమైంది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మున్సిపాలిటీ ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. దీంతో కమిషనర్‌ను సరెండర్​ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. ఇన్ చార్జి కమిషనర్​గా జడ్పీ డిప్యూటీ సీఈవో చందర్​నాయక్​ను, ఎన్నికల నోడల్​ అధికారిగా ఏపీడీ సాయన్నను నియమించారు.