
- 2.75 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చామన్న కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఈ ఏడాది 20 వేల కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటుందని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజిటల్ స్కిల్స్లో 2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామన్నారు.
టీసీఎస్ 12 వేల మందిని తొలగించిన నేపథ్యంలో, ఇన్ఫోసిస్ ఉద్యోగ కోతలు లేవని పరేఖ్ స్పష్టం చేశారు. ఏఐ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 5-–15శాతం, కస్టమర్ సర్వీస్లో 20శాతం ఉత్పాదకత పెరిగిందని వివరించారు. కిందటి ఆర్థిక సంవత్సరంలోని జూన్ క్వార్టర్, మార్చి క్వార్టర్లలో జీతాలు పెంచామని, తదుపరి పెంపునకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.