మున్సిపోల్స్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మున్సిపోల్స్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ సూచించారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై స్టేట్ ఎలక్షన్​ కమిషనర్​ రాణి కుముదిని ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీసీ నిర్వహించిన అనంతరం కలెక్టర్​ మాట్లాడారు.  కామారెడ్డిలో 49 వార్డుల్లో 152 పోలింగ్​ కేంద్రాలు, బాన్సువాడలో 19 వార్డుల్లో  39 పోలింగ్​ కేంద్రాలు, ఎల్లారెడ్డిలో 12 వార్డుల్లో 24 పోలింగ్​ కేంద్రాలు, బిచ్​కుందలో 12 వార్డుల్లో 24 పోలింగ్​ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

నామినేషన్​ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.  వెబ్​ కాస్టింగ్,  నోడల్​ అధికారులు, జోనల్​ అధికారులు, రిటర్నింగ్​ అధికారులు, పీవోలు, ఓపీవోల నియామకం, ఎన్నికల సామగ్రి,  స్ర్టాంగ్ రూమ్, కౌంటింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.   వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్,  ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.  

 స్కూల్స్​లో టాయిలెట్స్​ నిర్మాణాలు కంప్లీట్​ చేయాలి

కామారెడ్డిటౌన్ : జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్​లో ఉపాధిహామీ స్కీం కింద చేపట్టిన టాయిలెట్ నిర్మాణాలు కంప్లీట్ చేయాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. బుధవారం  కలెక్టరేట్​లో సంబంధిత శాఖ అధికారులతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. మార్కవుట్ ఇవ్వని చోట వెంటనే ఇవ్వాలని, మార్కవుట్ ఇది వరకే ఇచ్చి ఉంటే   పనులు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్​ కావాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ సంబంధిత అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టరేట్​లో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై రివ్యూ చేశారు.  ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీవో సురేందర్, డీఈవో రాజు, హౌజింగ్​ పీడీ జయపాల్​రెడ్డి, డీపీవో మురళీ తదితరులు పాల్గొన్నారు.