- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలో ఎండ కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని అధికారులకు కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో తాగునీటి సప్లయ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్, ఉపాధి హామీ పనులు, భూ గర్భజలాల పెంపు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, బ్యాంక్ లింక్ తదితర ఆంశాలపై రివ్యూ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ..
పనుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పైపులైన్లు, మోటార్ల రిపేర్ పనులు చేపట్టాలన్నారు. అవసరమయితే ప్రత్యామ్నాయంగా తాగునీటి సప్లయ్కు ఏర్పాట్లకు రెడీగా ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు టార్గెట్ రీచ్ కావాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, సీఈవో చందర్, డీఆర్డీవో సురేంధర్ తో పాటు ఆయా శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
