కామారెడ్డి జిల్లాలో రోడ్డుపై వరి నాట్లు వేసి స్థానికుల నిరసన

కామారెడ్డి జిల్లాలో రోడ్డుపై వరి నాట్లు వేసి  స్థానికుల నిరసన

కామారెడ్డిటౌన్, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్​నగర్ కాలనీ మెయిన్​ రోడ్డుపై సోమవారం స్థానికులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు.  కొత్త బస్టాండ్​ నుంచి  రైల్వే గేట్ వరకు ఉన్న అశోక్​నగర్​ కాలనీ మెయిన్​రోడ్డు గుంతలు పడి  వెహికల్స్​ రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. 

అధికారులకు  ఫిర్యాదు చేసినప్పటికీ  రిపేర్లు చేయించటం లేదని, గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.  మాజీ కౌన్సిలర్​ ప్రభాకర్​యాదవ్​, జగదీశ్,  శ్రీనివాస్, గంగరాం,   దినేశ్​రెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.