కామేపల్లికి దిగొచ్చిన ఆఫీసర్లు.. బీసీ సాయం అందజేత

కామేపల్లికి దిగొచ్చిన ఆఫీసర్లు.. బీసీ సాయం అందజేత

కామేపల్లి, వెలుగు : లక్ష రూపాయల బీసీ సాయం కోసం కామేపల్లి ఎంపీడీఓ ఆఫీస్​వద్ద పెట్రోల్​బాటిల్​తో ఆందోళనకు దిగిన ముచ్చర్ల గ్రామస్తుడు చల్లా వెంకటేశ్వర్లుకు చెక్కు అందింది. అర్హుల లిస్టులో తన పేరు ఉన్నా, చెక్కు ఇవ్వకపోవడంతో సోమవారం వెంకటేశ్వర్లు ఎంపీడీఓ ఆఫీస్​వద్ద ఆందోళనకు దిగాడు.

వార్తా పత్రికల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న ఖమ్మం కలెక్టర్ స్పందించారు. వెంటనే బాధితుడికి చెక్కు అందజేయాలని ఆదేశించారు. దీంతో మండల అధికారులు మంగళవారం వెంకటేశ్వర్లుకు చెక్కు అందజేశారు. వెంకటేశ్వర్లు వెంట కాంగ్రెస్​లీడర్లు ఉన్నారు.