ఇందిరాగాంధీతో కంగన చిట్‌చాట్.. మోదీతో కూడా

ఇందిరాగాంధీతో కంగన చిట్‌చాట్..  మోదీతో కూడా

బాలీవుడ్ నటి  కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం  ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.   ఈ చిత్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను కంగనా పోషిస్తుంది.  ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్  అనౌన్స్  చేయనప్పటికీ ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తుంది కంగనా. తాజాగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఓ ఫొటోవైరల్ గా మారింది. 

ఇందిరా ఏఐ ఇమేజ్ తో కూర్చున్న ఫొటోను కంగనా షేర్ చేసింది.  ఏఐ  టెక్నాలాజీ సహయంతో ఇందిరాగాంధీతో  చాట్ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ  కంగనా తెలిపింది. అంతేకాకుండా ప్రధాని మోదీ ఏఐ ఇమేజ్ తో దిగిన ఫొటోను కూడా కంగానా సోషల్ మీడియాలో షేర్ చేసింది.  దేశంలోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’ను కంగన సందర్శించింది.  వీరాంగనా కీ మహాగాథ పేరిట ఆవిష్కరించిన లైట్‌ అండ్ సౌండ్‌ షోలో ఆమె పాల్గొన్నారు.

ఎమర్జెన్సీ చిత్రంలో కంగనాతో పాటుగా చాలామంది  నటులు ఉన్నారు.  జయప్రకాష్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, మొరార్జీ దేశాయ్ పాత్రలో అశోక్ ఛబ్రా నటిస్తున్నారు. 1975-1977 మధ్య దేశంలో ఏర్పడిన  ఎమర్జెన్సీ సమయంలో జరిగిన సంఘటనల అధారంగా ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నారు.  2024లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ తనఖా పెట్టినట్లు కంగనా చెప్పారు.