ముంబైలో పవర్ కట్ పై కంగన కామెంట్స్ : అప్పుడు పీఓకే..ఇప్పుడు బుల్డోజర్

ముంబైలో పవర్ కట్ పై కంగన కామెంట్స్ : అప్పుడు పీఓకే..ఇప్పుడు బుల్డోజర్

ముంబైని పీఓకే తో పోలుస్తూ హీరోయిన్ కంగన రనౌత్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా పవర్ గ్రిడ్ లో లోపం తలెత్తడం వల్ల ముంబై లో కరెంట్ సమస్య తలెత్తింది. దీనిపై సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు కరెంట్ సమస్యపై స్పందిస్తున్నారు. తాజాగా హీరోయిన కంగన ముంబై కరెంట్ సమస్యపై మరోమారు మహరాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా బుల్డోజర్ తో ఆడుతున్న ఫోటోల్ని నెటిజన్లతో పంచుకుంది. ముంబైలో కరెంట్ పోతే మహరాష్ట్రప్రభుత్వం ఇలా చేస్తుందంటూ ట్వీట్ చేసింది.