- తహసీల్దార్ ఆఫీస్, కేజీబీవీ ఎదుట స్టూడెంట్స్ ఆందోళన
- స్పెషల్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్
బెల్లంపల్లిరూరల్, వెలుగు: తమకు పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారని మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని కేజీబీవీ స్టూడెంట్స్ ఆరోపించారు. స్పెషల్ ఆఫీసర్(ఎస్ఓ)ను సస్పెండ్ చేయాలంటూ శనివారం తహసీల్దార్ఆఫీస్ఎదుట ధర్నాకు దిగారు. స్టూడెంట్లు మాట్లాడుతూ మెనూ పాటించడం లేదని, స్నాక్స్ పెట్టడం లేదని చెప్పారు. ప్రశ్నిస్తే ఎస్ఓ అమూల్య బెదిరింపులకు దిగుతోందన్నారు. ఎస్సై సురేశ్, జడ్పీటీసీ సత్యనారాయణ స్టూడెంట్స్తో మాట్లాడారు. సమస్య పరిష్కరించాలని డీఈఓకు ఫోన్లో సూచించారు. ఎండ ఎక్కువగా ఉండడంతో స్టూడెంట్లను ఆటోలో కేజీబీవీకి పంపించారు. కొద్దిసేపటికే స్టూడెంట్లు కేజీబీవీ ఎదుట ఆందోళనకు దిగారు. ధర్నా చేసినందుకు మీ రిజల్ట్ సంగతి చూస్తానని ఎస్ఓ తమను బెదిరించారంటూ ఆరోపించారు. విషయం తెలుసుకున్న డీఈఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ మహేశ్వర్రెడ్డి అక్కడికి వెళ్లి స్టూడెంట్స్తో మాట్లాడారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు ఈ రోజు మార్నింగ్ చేసిన టిఫిన్టేస్ట్ చేయమని డీఈఓను అడిగారు. ముక్కిపోయిన బియ్యం, కుళ్లిన కూరగాయలను చూసి ఎస్ఓపై డీఈఓ ఫైర్ అయ్యారు. పద్ధతి మార్చుకోకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ముక్కిపోయిన బియ్యాన్ని ఎమ్మార్సీకి తరలించాలని ఎంఈఓను ఆదేశించారు. అనంతరం స్టూడెంట్స్ లీడర్లు, పేరెంట్స్ డీఈఓకు వినతిపత్రం ఇచ్చి ఎస్ఓను సస్పెండ్ చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఆ ప్రిన్సిపల్ మాకొద్దు: స్టూడెంట్స్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: మావల మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాలయం ప్రిన్సిపల్ భూలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ఆ ప్రిన్సిపల్ మాకొద్దంటూ శనివారం మధ్యాహ్నం మావల నుంచి స్టూడెంట్లు చెప్పులు లేకుండా కాలినడకన కలెక్టరేట్కు తరలివచ్చి ధర్నా చేశారు. కలెక్టర్ లేకపోవడంతో జడ్పీ ఆఫీస్ ముందు రెండు గంటలపాటు బైఠాయించారు. ప్రిన్సిపల్ భూలక్ష్మి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. కనీస సౌకర్యాలు కల్పించాలని కోరితే పోలీస్ కేసులు పెట్టిస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్భాషా అక్కడికి చేరుకొని స్టూడెంట్లతో మాట్లాడారు. ప్రిన్సిపల్, వైస్ప్రిన్సిపల్పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం స్టూడెంట్లను బస్ ఏర్పాటు చేసి అందులో కాలేజీకి పంపించారు.