బ్రేకింగ్ న్యూస్.. 13 స్కూళ్లకు బాంబు బెదిరింపు

బ్రేకింగ్ న్యూస్.. 13 స్కూళ్లకు బాంబు బెదిరింపు

బెంగళూరులోని 13 పాఠశాలలకు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం బాంబు ఉందని బెదిరింపు మెయిల్స్ వచ్చాయని అధికారులు తెలిపారు. అనంతరం వెంటనే పాఠశాలలను మూసివేయించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు అన్ని పాఠశాలల ఆవరణల్లో బాంబు కోసం వెతకడం ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు అనుమానాస్పద వస్తువులు గానీ, బాంబుకు సంబంధించిన వస్తువులు లాంటి ఎలాంటి ఆధారాలు గానీ వారికి లభించలేదు.

ప్రస్తుతం పాఠశాలల్లో పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ఇలాంటి మెయిల్ బెదిరింపులు వచ్చాయి. అయితే ఆ తర్వాత అవి బూటకమని తేలింది.