బెంగళూరు: బీజేపీ మునుపటిలా నిధులను సమీకరించలేకపోతోందని, వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆపై 2024 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమి ఖాయమైందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇంతకాలం కర్నాటకలో 40% కమీషన్ ద్వారా వచ్చే ఆదాయం ఇప్పుడులేదని, అందుకే ధనిక వ్యాపారులు, కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేసేందుకు ఐటీ,-ఈడీతో దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు.
5 రాష్ట్రాల ఎన్నికల కోసం పార్టీకి నిధులు ఇచ్చేందుకు కర్నాటకలో అధికార కాంగ్రెస్ డబ్బు సమకూరుస్తోందన్న బీజేపీ ఆరోపణలపై ఆయన బుధవారం ‘ఎక్స్’లో స్పందించారు.