కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి

కంగనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలకు దిగారు.ఈ క్రమంలోనే బాలీవుడు సినీనటి కంగనా రనౌత్ చేసిన ఓ ట్వీట్ సంచలనం సృష్టించింది. అన్నదాతలపై ఆమె ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసింది.

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో కంగనా ఆ ట్వీట్ ను డిలేట్ చేసింది. దానిపై స్పందిస్తూ..  తాను రైతుల‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని మరో ట్వీట్ లో తెలిపింది. ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు కర్ణాటకలోని ఓ కోర్టులో కేసులో వేసి, ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కంగనా రనౌత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.