హైదరాబాద్ జవహర్ నగర్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. జీహెచ్ఎంసీలో అమలవుతున్న ఘన పదార్థాల నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్ తయారీ, చెత్త ట్రాన్స్ఫర్ తయారీ స్టేషన్లను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ నుండి చెత్తను ఏ విధంగా తరలిస్తున్నారో.. ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారని విషయాలను తెలుసుకున్నామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
Also Read :- కాంగ్రెస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు
CWC సమావేశం కోసం హైదరాబాద్ కు వచ్చిన డీకే శివకుమార్.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పని తీరును పరిశీలించారు. పవర్ ప్లాంట్ పనితీరును రాంకీ నిర్వహకులు డీకే శివకుమార్ కు వివరించారు.