బెంగళూరు: కరోనా కేసులు భారీగాపెరుగుతుండటంతో కర్నాటక హోంమంత్రి బస్వారాజు బొమ్మై హవేరి జిల్లా షిగ్గావిలోని తన ఇంటిని కొవిడ్కేర్సెంటర్(సీసీసీ)గా మార్చారు. 50 మంది పేషెంట్లకు వసతులతో ఆ ఇంటి ఆవరణలో ఏర్పాట్లు చేశారు. అక్కడ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, ఇతర సిబ్బందిని కూడా నియమించినట్లు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇంటి వరండాలో 50 బెడ్లతో పాటు సివియర్ పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ను అందించేందుకు కాన్సంట్రేటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. ఓ మంత్రి తన నివాసాన్ని కొవిడ్కేర్సెంటర్గా మార్చడం ఇదే తొలిసారని.. దీనివల్ల నియోజకవర్గంలోని తాలూకా ఆస్పత్రిపై భారం కూడా తగ్గుతుందని పేర్కొన్నాయి.
