రుచికరమైన ఫుడ్ అందించాలనే ఉద్దేశంతోనే ఏ రెస్టారెంట్ అయినా మొదలవుతుంది. కస్టమర్స్ కూడా మంచి ఫుడ్, బ్యూటిఫుల్ యాంబియెన్స్ ఎక్స్పీరియెన్స్ చేయాలని రెస్టారెంట్లకు వెళ్తుంటారు. కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేపనిలో భాగంగా రకరకాల థీమ్స్తో రెస్టారెంట్లు నడుపుతున్నారు చాలామంది. అయితే ఇంకాస్త ముందుకెళ్లి వెరైటీగా ఆలోచిస్తున్నాయి మన ఇండియన్ రెస్టారెంట్లు.
ఇక్కడ కేవలం తినడం మాత్రమే కాదు.. మరెన్నో యాక్టివిటీలు చేస్తూ ఎంజాయ్ చేసే విధంగా మారబోతున్నాయి. ఒక్కసారి రెస్టారెంట్లోకి అడుగుపెడితే కూర్చుని సినిమా చూసే దగ్గర నుంచి బోర్డ్ గేమ్స్, పాటరీ, పెయింటింగ్.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ని ఎంజాయ్ చేయొచ్చు.
ఇండియాలో అనేక అవుట్ లెట్లు ఉన్న అతిపెద్ద బార్ చెయిన్ ‘సోషల్’. బెంగళూరులోని ఒక బ్రాంచ్లో మొట్టమొదటిసారి ‘బ్యాట్స్ అండ్ బూజ్’ పేరుతో లెక్చర్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ బ్యాట్ రీసెర్చర్ అయిన డాక్టర్ రోహిత్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగింది.
ఇందుకోసం టికెట్స్ చాలా ఫాస్ట్గా అమ్ముడయ్యాయి. పింట్ ఆఫ్ వ్యూ గ్రూప్ ఈ ఈవెంట్ని చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లెక్చర్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది ఆ టీమ్. ఢిల్లీలోనూ సాకెట్ సోషల్లో ‘హౌ ఐ మెట్ యువర్ మ్యాటర్’ టైటిల్తో మెటీరియల్ సైంటిస్ట్, మెకానికల్ ఇంజనీర్ అయిన డాక్టర్ రమ్య అహుజా లెక్చర్ ఇచ్చింది. ఇందులో కాఫీ మగ్స్ నుంచి కాక్టెయిల్ గ్లాస్లు, బట్టలు ప్యాక్ చేయడం వరకు ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.
రెస్టారెంట్స్ విజిటర్స్కి క్రియేటివ్ ఎక్స్పీరియెన్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఇలాంటి కాన్సెప్ట్స్ ముందుకు వస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లు పెయింటింగ్, మగ్ పెయింటింగ్, క్లే మోడలింగ్ వంటి యాక్టివిటీస్ చేసేలా వీలు కల్పిస్తున్నాయి. ఇలాంటి చోట్లకు వెళ్లినప్పుడు ఆ రోజు మెమొరబుల్ అవుతుందని, కాసేపు డిజిటల్ వరల్డ్కి దూరంగా ఉండొచ్చని అనుకుంటున్నారు.
►ALSO READ | సినిమాల్లో బహుజనుల స్థానమేంటి?
ఇంకా కొన్ని రెస్టారెంట్లు అయితే విజిటర్స్కు కుకింగ్ క్లాసులు కూడా చెప్తున్నాయి. లియోస్ పిజ్జేరియా సండే పిజ్జా మేకింగ్ మాస్టర్క్లాసెస్ను ఆఫర్ చేస్తోంది. సుషీ రోల్ ఎలా చేయాలి? వంటివి నేర్పిస్తున్నారు. గురుగ్రామ్లోని ఓ రెస్టారెంట్లో పాస్తా చేయడమెలాగో నేర్పిస్తున్నారు.
ప్రజలు కేవలం ఫుడ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే రెస్టారెంట్కి రావట్లేదు.
వాళ్లకు ఒక డిస్కవరీ, ఎమోషన్ కావాలి. అది ఫుడ్ నుంచి మాత్రమే దొరకదు. అందుకే నైట్ టైంలో కూడా పెయింట్ చేయడం, సుషీ మేకింగ్ వంటి క్రియేటివ్ వర్క్షాప్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
వీటిలో పార్టిసిపేట్ చేసి కొత్త అనుభవాలను, కొన్ని మధురమైన క్షణాలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక పదేళ్ల కిందట లైవ్ మ్యూజిక్ ఉండేది. బార్స్, క్లబ్స్లో డాన్స్ కూడా ఉండేది. కానీ, ఇప్పుడు డైనింగ్ అంటే యాక్టివిటీ ప్లేస్ కూడా. ఇంకా చెప్పాలంటే కల్చరల్ సెంటర్స్గా మారుతున్నాయి.
గతంలో ఒక్క టీ షాప్కి వెళ్తే కొత్త పరిచయాలు, తెలియని వాళ్లతో రకరకాల అంశాల పై చర్చలు సరదాగా జరిగేవి. ఇప్పుడు అలాగే ఈ యాక్టివిటీస్ ద్వారా సోషల్ కమ్యూనికేషన్ పెరుగుతుంది. పైగా రెస్టారెంట్లకు తరచూ వెళ్లేవాళ్లకంటే బర్త్ డే, యానివర్సరీ వంటి స్పెషల్ డేస్ని మెమొరబుల్గా చేసుకోవడానికి వెళ్లే వాళ్లే ఎక్కువ. అలాంటివాళ్లకు ఇలాంటి రెస్టారెంట్లు అద్భుతమైన అనుభూతినిస్తాయనడంలో సందేహం లేదు.
