కర్ణాటకలో తెరుచుకోనున్న జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు

కర్ణాటకలో తెరుచుకోనున్న జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు

కర్ణాటకలో జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోనున్నాయి. మూడో దశ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే వీటిని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి సీటీ రవి తెలిపారు. వీటిని తెరిచే విషయమై సీఎం బీఎస్ యడియూరప్పతో చర్చించినట్టు తెలిపారు.

రెస్టారెంట్లు, హోటళ్లు తిరిగి ప్రారంభించే విషయంలో సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి రవి తెలిపారు. ఈ నెల 17న లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రాష్ట్రంలో  జిమ్‌లు, గోల్ఫ్ క్లబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు పర్మిషన్ ఇస్తామని మంత్రి చెప్పారు.