
రేపు(సోమవారం) కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సమయంలో స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుకాగా, మిగతా వారు జేడీఎస్ ఎమ్మెల్యేలు. దీంతో కన్నడ అసెంబ్లీ నుంచి మొత్తం 17 మందిపై అనర్హత వేటు పడింది. గతవారంలో రమేశ్ కుమార్ ముగ్గురిపై అనర్హత వేటు వేశారు. ఇక వీరెవరూ నాలుగేళ్ల పాటు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదు.
ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ ను స్వయంగా మీడియా ముందు ప్రకటించిన రమేశ్ కుమార్, స్పీకర్ గా తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అనర్హత వేటు పడిన వారిలో కాంగ్రెస్ నుంచి బస్వరాజు, మునిరత్నం, సోమశేఖర్, సుధాకర్, శివరాం హెబ్బర్, శ్రీమంత పాటిల్, జేడీఎస్ నుంచి గోపాలయ్య, నారాయణ గౌడ, విశ్వనాథ్ ఉన్నారు.