
తన తరువాతి సినిమా కోసం కార్తి(Karthi) వినూత్న కథను ఎంచుకున్నాడు. ఎయిడ్స్ తో చనిపోయిన దొంగ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఆ సినిమానే "జపాన్(Japan movie)". డైరెక్టర్ రాజమురుగన్(Rajamurugan) తెరకెక్కుస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అదేంటంటే.. ఈ సినిమా ఒక పేమస్ దొంగ నిజ జీవితం ఆధారంగా రానుందట. తమిళనాడులోని చెన్నైలో లలితా జ్యువెలరీలో తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి 13 కోట్ల విలువైన ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు. 2019లో జరిగిన ఈ చోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం తమిళనాడులోనే కాదు దక్షిణాదికి చెందిన చాలా రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తరువాత కొంతకాలం జైలు జీవితం గడిపిన మురుగన్ 2020లో ఎయిడ్స్తో మరణించాడు.
ఈ రియల్ కథ ఆధారంగానే జపాన్ సినిమా తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే కథ అదే కానీ దాంట్లో చాల మార్పులు చేస్తున్నారట. ఇక ఈ విషయం తెలుసుకున్న కార్తి ఫాన్స్ కాస్త డిజపాయింట్ అవుతున్నారట. ఒరిజినల్ కథ కాబట్టి కార్తి కూడా సినిమాలో చనిపోతాడా అనే కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగా హీరో చనిపోతాడా? లేదా ఆ ఎలిమెంట్ ను మార్చేశారా అనేది చూడాలి.