కార్వీ స్కాం కేసులో ఎండీ పార్థసారధి, సీఎఫ్ వో కృష్ణ హరిలను మూడో రోజు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకోని విచారణ జరపనున్నారు. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరిట భారీ మోసాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. గతంలో CCSలోని కేసు ఆధారంగా విచారణ జరపనున్నారు. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఆరా తీస్తున్నారు. నిధుల దారి మళ్లింపు, షెల్ కంపెనీల వ్యవహారం, విదేశి పెట్టుబడులపై ఈడీ విచారణ జరపనుంది.
మరిన్ని వార్తల కోసం