తప్పు సమాధానం చెప్పినా ప్రైజ్మనీ

తప్పు సమాధానం చెప్పినా ప్రైజ్మనీ

కౌన్ ​బనేగా కరోడ్​పతి14వ సీజన్​ కొత్తగా ఉండబోతోంది.  కారణం... ఈసారి ప్రైజ్​మనీని పెంచడమే. ఇంతకుముందు సీజన్స్​లో కోటి రూపాయలు గెలుచుకున్నాక ఏడున్నర కోట్ల ప్రశ్న అటెంప్ట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్లు. కారణం... తప్పు సమాధానం  చెప్తే రూ. 3.20 లక్షలకు పడిపోవడమే. దాంతో కంటెస్టెంట్స్​ రిస్క్​ తీసుకునేవాళ్లు కాదు. అయితే ఈ సీజన్​లో కంటెస్టెంట్స్​ రిస్క్​ తీసుకున్నా పెద్దగా నష్టపోరు. ఎందుకంటే..  ఏడున్నర కోట్ల ప్రశ్నకు తప్పుగా సమాధానం చెప్పినా 75 లక్షల రూపాయల ప్రైజ్​మనీ గెలుచుకోవచ్చు. అదెలాగంటే... మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఆగష్టు 15కి 75 ఏండ్లు అవుతుంది. ఈ సందర్భంగా కేబీసీ స్పెషల్ జాక్​పాట్ ప్రైజ్ అనౌన్స్​ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోని సోని టీవీ రిలీజ్​ చేసింది. అందులో... హోస్ట్ అమితాబ్ బచ్చన్​ కోటి రూపాయలు గెలిచిన కంటెస్టెంట్​ని ‘ఇంకా ఆడతారా?’ అని అడుగుతాడు. తర్వాతి ప్రశ్నకు వెళ్లడం ఇష్టం లేదన్నట్టుగా చూస్తాడు అతను. ‘ఏడు కోట్ల ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకున్నా 75 లక్షలు గెలుస్తారు’ అని చెప్పడంతో ఆ కంటెస్టెంట్​ ముఖం నవ్వుతో వెలిగిపోతుంది. ఈ షో త్వరలోనే సోనీ టీవీలో టెలికాస్ట్ కానుంది.