![ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ](https://static.v6velugu.com/uploads/2023/10/KCR-admitted-defeat-by-contesting-in-2-constituencies_yJOK86asZp.jpg)
కామారెడ్డి, వెలుగు: ఓటమి భయంతోనే కేసీఆర్కామారెడ్డి, గజ్వేల్లో పోటీ చేస్తున్నారని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి విమర్శించారు. మాచారెడ్డి మండలం అంతంపల్లికి చెందిన పలువురు మహిళలు, యువకులు శనివారం బీజేపీలో చేరారు. వారికి వెంకటరమణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
కొత్త పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దళితబంధు, బీసీ, మైనార్టీ బంధుల పేర్లతో గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తున్నారన్నారు. బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.