
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్కేసీఆర్తో హరీశ్రావు మరోసారి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో కేసీఆర్తో అరగంటకుపైగా చర్చించారు. కేసీఆర్, హరీశ్రావుకు మంగళవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై మంగళవారం సాయంత్రమే కేసీఆర్, హరీశ్రావు భేటీ అయ్యారు. తాజాగా గురువారం కూడా మళ్లీ కలిసి చర్చించారు. కమిషన్ విచారణకు హాజరవ్వాలా? వద్దా? అన్న అంశంపై వారిద్దరూ చర్చించినట్టు తెలిసింది. నోటీసులపై ఏ విధంగా స్పందించాలి? కమిషన్కు ఏం రిప్లై ఇవ్వాలి? వంటి వాటిపైనా మంతనాలు జరిపినట్టు సమాచారం.