
కోరుట్ల,వెలుగు: నాసిరకంగా కట్టడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని కోరుట్ల కాంగ్రెస్అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. శుక్రవారం కోరుట్లలో జువ్వాడి నామినేషన్వేశారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ నుంచి నందిచౌరస్తా వరకు శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ కోరుట్ల లో వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కనిపించలేదన్నారు.
ఎమ్మెల్యే కొడుకు, బీఆర్ఎస్అభ్యర్థి డాక్టర్ సంజయ్ డిస్కౌంట్ డాక్టర్ కాదనీ, రోగులకు బిల్లులు ఎక్కువ చేసి కమీషన్లు తీసుకుంటున్నాడని ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో లీడర్లు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం పాల్గొన్నారు.