అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. వీటి గురించే ప్రధాన చర్చ

అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. వీటి గురించే ప్రధాన చర్చ

ఢిల్లీ టూర్‎లో ఉన్న సీఎం కేసీఆర్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్‎లో ఉన్న అంశాలపై అమిత్ షాతో డిస్కస్ చేశారు. అలాగే.. ఐపీఎస్ క్యాడర్‎కు సంబంధించి అమిత్ షాతో చర్చించారు. కొత్త జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లు పెరిగిన నేపథ్యంలో ఐపీఎస్ క్యాడర్ మీద సమీక్ష చేయాలని వినతీపత్రం అందించారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు ఏర్పడటంతో.. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు రాష్ట్రానికి మంజూరు చేయాలని అమిత్ షాను కేసీఆర్ కోరారు.