మునుగోడు బైపోల్ టైంలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిపై ఫోన్ ట్యాపింగ్

మునుగోడు బైపోల్ టైంలో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిపై ఫోన్ ట్యాపింగ్

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్​ వేసిన స్కెచ్​లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల టైమ్​లో ప్రతిపక్ష నేతల కదలికలను తెలుసుకునేందుకు వాళ్లందరి ఫోన్లను ట్యాప్​ చేయించారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో అరెస్టయిన టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి.

మునుగోడు ఉప ఎన్నిక  టైమ్​లో ఎమెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, జి.వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామితోపాటు వాళ్ల బంధువులు, అనుచరులను ఫోన్లను గత సర్కార్​ ట్యాప్ చేయించింది. నాటి సీఎంవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చిన పేర్లు, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తుల కదలికలు, ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్​రావు అంగీకరించాడు. 

ఫోన్​ ట్యాపింగ్​ను సొంత పార్టీ(బీఆర్​ఎస్​) నేతలపైనా కేసీఆర్​ ప్రయోగించారు. పార్టీకి ఇబ్బందికరంగా అనిపించిన సొంత పార్టీ నేతలను కూడా ఆయన వదలలేదని రాధాకిషన్​రావు వెల్లడించాడు. ఇందుకోసం ప్రణీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆధ్వర్యంలో స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వెలైన్స్ నడిచిందన్నాడు. కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా  పనిచేస్తున్నారని బీఆర్​ఎస్​ నేత శంభీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజుపై, అదేవిధంగా ఇతర సందర్భాల్లో కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, పట్నం మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఆయన భార్య సునీత, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డిపైనా కేసీఆర్​ ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా నిఘా పెట్టినట్లు తేలింది.