గజ్వేల్‌‌లో కేసీఆర్‌‌‌‌కు తగ్గిన మెజార్టీ

గజ్వేల్‌‌లో కేసీఆర్‌‌‌‌కు తగ్గిన మెజార్టీ

సిద్దిపేట, వెలుగు : గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌‌‌‌పై 45,174 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా కేసీఆర్‌‌‌‌కు 1,11,244 ఓట్లు వచ్చాయి. గతంలో 57,321 మెజార్టీ రాగా, ఈసారి 45 వేల ఓట్లకే పరిమితం అయ్యారు.  

ఈటల రాజేందర్‌‌‌‌కు 65,961 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డికి 32,322, బీఎస్పీ అభ్యర్థి జక్కని సంజయ్ కుమార్‌‌‌‌కు 2,710, అమర వీరుల కుటుంబాల తరఫున పోటీ చేసిన మేకల రఘుమారెడ్డికి 2,230 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు సహా మొత్తం 44 మంది పోటీ చేశారు.