కేసీఆర్కు హింస ప్రవృత్తిగా మారింది: తరుణ్ చుగ్

 కేసీఆర్కు  హింస ప్రవృత్తిగా మారింది: తరుణ్ చుగ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు హింస ప్రవృత్తిగా మారిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. అహంకారంతో కేసీఆర్​ కుటుంబ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. గౌరవ ప్రజాప్రతినిధి అయిన ఎంపీ అర్వింద్ ఇంటిపైకి కిరాయి గూండాలను పంపి దాడి చేయడం దుర్మార్గమని తరుణ్ చుగ్ అన్నారు. 

శామీర్ పేట్ లియోనియా రిసార్ట్ లో బీజేపీ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవాల సందర్భంగా తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ భరతం పడతామన్నారు. మూడు రోజులపాటు బీజేపీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంతో పాటు 14అంశాలపై శిక్షణా తరగతుల్లో చర్చిస్తున్నారు. సమావేశాల చివరి రోజు బీజేపీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేయనున్నారు.