జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్

జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్

తెలంగాణలో అసమర్థులు రాజ్యాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు.  అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.  రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని ఓ మంత్రి అంటున్నారని.. రైతుల చెప్పులు ఇంకా గట్టిగా ఉంటాయని తాను మంత్రికి  చెప్పనన్నారు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు వచ్చిన  కరెంట్ ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.  

బీఆర్ఎస్ హయాంలో మిగులు విద్యుత్ ఉండేలా చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో  రైతుబంధులో దగా.. రైతుబీమా ఉంటుందో.. ఊడుతుందో తెలియదన్నారు.   పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వం మెడలు వచ్చి 420  హామీలను అమలు చేయించేలా పోరాటం చేస్తామన్నారు.  జైళ్లకు భయపడే వ్యక్తి తాను కాదన్నారు కేసీఆర్. తాను జైళ్లకు బయపడితే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.  నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కేసీఆర్.