త్వరలోనే వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్ కు కేసీఆర్ ఆమోదం

త్వరలోనే వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్ కు కేసీఆర్ ఆమోదం

వరంగల్ రింగ్ రోడ్డు కు భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగ్ లో జరిగిన కుడా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఇక వరంగల్ నూతన మాస్టర్ ప్లాన్ సిద్దమైందన్న ఆయన..త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ ప్రక్రియకు ఆమోదం తెలుపుతారన్నారు. కాగా కొన్ని రాజకీయ శక్తులు, ల్యాండ్ మాఫియా ముఠాలు రైతులను పక్కదోవపట్టించాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ రద్దు చేయడం కొందరికి మింగుడు పడడం లేదని విమర్శించారు. ఇప్పటికే కొన్ని ముఠాలు రైతులను గందరగోళంలో పడేశాయని...కానీ రైతులు ఆందోళన చెందవద్దు అని ఆయన చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తల కోసం..

కృష్ణ బర్త్ డేకు సుధీర్ బాబు అదిరిపోయే గిఫ్ట్

ఊరి కోసం పుస్తెల తాడు అమ్మి వడ్డీ కట్టిన సర్పంచ్