‘మహానటి’ లాంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కీర్తి సురేష్.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. మరో టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే కూడా ఇందులో నటిస్తోంది. ధర్మరాజ్ శెట్టి దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఈ ఫిమేల్ సెంట్రిక్ వెబ్ సిరీస్ను నిర్మిస్తోంది.
గత ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ అతి త్వరలో సెట్స్పైకి వెళ్లబోతోంది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ రివెంజ్ డ్రామాను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా తెరకెక్కించనున్నారు. ఇందులో ఒకరంటే మరొకరికి పడని ప్రత్యర్థులుగా కీర్తి సురేష్, రాధిక ఆప్టే కనిపించనున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ఆదిత్య చోప్రా చెప్పారు.