కీసర,వెలుగు: మహా శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలో జరిగే రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి మల్లారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో సంబంధిత అధికారులు, ఆలయ కమిటీలతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27 నుంచి మార్చి4 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయన్నారు. భక్తులందరికీ ఉచిత దర్శనంతో పాటు వీవీఐపీ, వీఐపీ దర్శనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు ప్రత్యేక నిధులు విడుదల చేసిందని, బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ కమిటీ కీసర గుట్టపై, దిగువన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ట్రాఫిక్, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా ప్రాంతాల నుంచి గుట్టకు వచ్చిన భక్తులకు ట్రాన్స్ పోర్టు కల్పించే అంశాలను నిరంతరం పరిశీలించాలన్నారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ..6 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని.. పోలీసులు ఎప్పుడు అలర్ట్గా ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు నర్సింహారెడ్డి, శాంసన్, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ లింగ్యానాయక్, ఆలయ ఈవో కె. సుధాకర్ రెడ్డి, ధర్తకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కీసర బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
- హైదరాబాద్
- February 13, 2022
లేటెస్ట్
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్