కీసర, వెలుగు: ఫేక్ డాక్యుమెంట్లతో స్థలం కాజేసిన ఐదుగురిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. అంజిరెడ్డి, ప్రదీప్, సురేశ్, రెహమాన్, మల్లేశ్వరరావు, వెంకటేశ్ తో పాటు మరో నలుగురు గ్యాంగ్గా ఏర్పడ్డారు.
రాంపల్లి గ్రామంలోని లక్ష్మీనగర్ లోని జానకిటి నాగయ్యకు చెందిన 500 గజాల స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తమ గ్యాంగ్కే చెందిన ఇద్దరి పేరుపై కీసర రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. అసలైన ఓనర్ కీసర పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.