హైదరాబాద్ లో ఫేక్ డాక్యుమెంట్లతో .. 500 గజాల స్థలం కాజేసిన్రు

హైదరాబాద్ లో ఫేక్ డాక్యుమెంట్లతో .. 500 గజాల స్థలం కాజేసిన్రు

కీసర, వెలుగు: ఫేక్ డాక్యుమెంట్లతో స్థలం కాజేసిన  ఐదుగురిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. అంజిరెడ్డి, ప్రదీప్, సురేశ్,  రెహమాన్, మల్లేశ్వరరావు, వెంకటేశ్ తో పాటు మరో నలుగురు  గ్యాంగ్​గా ఏర్పడ్డారు.  

రాంపల్లి గ్రామంలోని లక్ష్మీనగర్ లోని  జానకిటి నాగయ్యకు చెందిన 500 గజాల స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి తమ గ్యాంగ్​కే చెందిన ఇద్దరి పేరుపై కీసర రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. అసలైన ఓనర్ కీసర పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు.