జైలు నుంచి తప్పించుకున్న మహిళా ఖైదీలు అరెస్ట్

జైలు నుంచి తప్పించుకున్న మహిళా ఖైదీలు అరెస్ట్

రెండు రోజుల క్రితం జైలు నుంచి పరారైన  ఇద్దరు మహిళా ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మంగళవారం సంధ్య(26), శిల్ప(23) అనే ఇద్దరు మహిళా ఖైదీలు కేరళలోని తిరునవనంతపురం జిల్లా అట్టక్కులంగర జైలు నుంచి తప్పించుకున్నారు. సాయంత్రం జైలులో ఖైదీల సంఖ్యను లెక్కించే సమయంలో ఈ విషయం బయటపడింది. జైలు సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి వీరు తప్పించుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసలు.. వారి ఆచూకీ కోసం తమిళనాడులో కూడా గాలింపు చేపట్టారు. చివరకు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పాలోడ్‌ సమీపంలో వారిని అరెస్ట్‌ చేశారు.